Telangana Governor : తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ ప్రారంభించాలనినిర్ణయిచారు. అందులో భాగంగా వచ్చే శుక్రవారం జూన్ 10న తేదీన మొదట మహిళా దర్బార్ తో మొదలు పెడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.