Renu Desai : రేణు దేశాయ్ ‘జేమ్స్ పాండు’ అనే తమిళ సినిమాలో పార్థిబన్ పక్కన హీరోయిన్గా 2000 లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. బద్రి సినిమాలో తెలుగు తెరపై తళుక్కుమన్నారు. తరువాత పవన్ కల్యాణ్ తో ప్రేమ, పెళ్లి అందరికీ తెలిసినవే. 2003 లో జానీ సినిమా తరువాత సినిమాల్లో కనిపించలేదు. 2012 లో పవన్తో విడాకుల తర్వాత పిల్లల బాధ్యతలో ఇంటికే పరిమితం అయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంలో రేణు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
రేణుదేశాయ్ రీసెంట్గా మీడియాతో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు మాట్లాడారు. అబ్బాయి పుడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే తను పుట్టినందుకు తన తల్లితండ్రులు చాలా డిజప్పాయింట్ అయ్యారని రేణు అన్నారు. మూడురోజుల వరకు తండ్రి తన ముఖం కూడా చూడలేదని రేణుకి తల్లి చెప్పారట. ఆడపిల్ల పుట్టిందని చంపేసిన వారు ఉన్నారు కానీ తన తల్లితండ్రులు చదువుకున్నవారు కాబట్టి తనను చంపలేదని చెబుతూ రేణు ఎమోషనల్ అయ్యారు. తల్లిలేని వారి కంటే కూడా తల్లి ఉండి ఆ ప్రేమను పంచకపోవడం నరకమని, తన తల్లితండ్రుల ప్రేమ కోసం తను పరితపించానని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసారు.
చాలామంది తన జీవితంలో డైవర్స్ చాలా బ్యాడ్ పీరియడ్గా అనుకుంటారని.. నిజానికి తన పుట్టింట్లో తల్లితండ్రుల ఆదరణకు నోచుకోని బిడ్డగా పెరిగిన సమయమే తన బ్యాడ్ పీరియడ్ అన్నారు రేణు దేశాయ్. తనను పనివాళ్లు పెంచారని చెప్పుకొచ్చారు. తనకు పవన్తో విడాకులు అయిన తర్వాత వేరొకరితో ఎంగేజ్మెంట్ అయినా తనలాంటి పరిస్థితి తన పిల్లలకు ఎదురు కాకూడదనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు రేణు దేశాయ్ చెప్పారు. తనకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టమని.. రెండు మూడేళ్లలో పిల్లలు పూర్తిగా సెట్ అవుతారని తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని రేణు స్పష్టం చేశారు. అకీరాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని.. వస్తే తప్పకుండా గ్రాండ్గా అనౌన్స్ చేస్తానని రేణు చెప్పారు. ప్రస్తుతం రేణు చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.