Renu Desai played Hemalatha Lavanam role in Raviteja Tiger Nageswara Rao
Renu Desai : పవన్ కళ్యాణ్ ‘జానీ’ సినిమా తరువాత మళ్ళీ నటించని రేణూదేశాయ్.. ఇప్పుడు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీలో రేణూదేశాయ్.. ‘హేమలత లవణం’ అనే పాత్రని చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాలో నిజ జీవిత పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. రేణూదేశాయ్ పోషించే హేమలత పాత్ర కూడా నిజం జీవితంలోనిదే. ఇంతకీ ఆమె ఎవరు..?
లెజెండరీ రచయిత ‘గుర్రం జాషువా’ కూతురే ‘హేమలత లవణం’. ఈమె ఒక సంఘసంస్కర్త, అలాగే తండ్రిలా ఒక రచయిత కూడా. జాతి వివక్ష, అంటరానితనం వంటి సమస్యలు పై ఈమె జీవితాంతం పోరాడారు. 19వ కాలంలో తన భర్తతో కలిసి హేమలత.. నేరాలకు పాల్పడే నేరస్థుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈక్రమంలోనే స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావుని కూడా ఆమె కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సన్నివేశాలని ఈ సినిమాలో చూపించబోతున్నారు.
Also read : Renu Desai : అకీరాపై రేణు దేశాయ్ కలలు ఏంటో తెలుసా.. నా కొడుకుని అలా చూడాలని ఉంది..
పవర్ లేడీగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా హేమలత లవణం నిలిచారు. అలాంటి వ్యక్తి పాత్రని రేణూదేశాయ్ పోషిస్తుండడం.. రీ ఎంట్రీకి ఎంతో గ్రాండియర్ ఇచ్చింది. ఇటీవల హేమలత లవణంగా రేణూదేశాయ్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.