Alliance Politics : టీడీపీలో సీనియర్ల అసంతృప్తులు, ప్రత్యేక సమావేశాలు కొనసాగుతుండగా.. జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటున్న పిఠాపురంలోనూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగుతున్నాయి. పొత్తు ధర్మంలో త్యాగాలు చేయడానికి పవన్ సిద్ధం అంటుంటే.. పిఠాపురం వదులుకోవడానికి సిద్ధంగా లేమని అక్కడి టీడీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టడంతో పాటు నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో జనసేనకు కేటాయించిన తిరుపతి సీటుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అటు బీజేపీ నేతలు సైతం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లను పక్కన పెట్టిన అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. 17 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించినా.. ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? లెక్క కుదిరిందా? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి విశ్లేషణ..
Also Read : మూడు పార్టీల్లో చిచ్చు రేపిన టీడీపీ సెకండ్ లిస్ట్.. ఏం జరగనుంది?
పూర్తి వివరాలు..