బీజేపీలో విలీనం పక్కా..!- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

Minister Komati Reddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్న సమాచారం తమకు ఉందన్నారు. బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మెండిచేయి చూపిస్తే కేసీఆర్ కనీసం నోరు ఎత్తలేదన్నారు. నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇవన్నీ గమనిస్తే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపైన చర్చలు జరుపుతున్నట్లే కదా అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ విలీనంపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

”కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిస్తే.. కేసీఆర్ నోరు కూడా ఎత్తలేదు. నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం మీద ఏమీ మాట్లాడలేదు. అంటే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చలు జరుగుతున్నట్లే కదా. బీఆర్ఎస్ విలీనం మీద మాకు పక్కా సమాచారం ఉంది.

కేసీఆర్ చేసిన అప్పులకే.. 42 వేల కోట్లు కడుతున్నాం. రాష్ట్ర విభజన సమయంలో 75 వేల కోట్లున్న అప్పు.. కేసీఆర్ దానిని 7 లక్షల కోట్లు చేశారు. వారంలో లక్షన్నర రుణ మాఫీ.. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 8 నెలలు ఇంట్లో పడుకున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు మిమ్మల్ని చీల్చి చెండాడారు. ఏనాడైనా వ్యవసాయ రంగానికి ఇంత బడ్జెట్ పెట్టారా? 6 గ్యారంటలకు 37 వేల కోట్లు నిధులు. వచ్చే 10 రోజుల్లో బ్రాహ్మణ వెళ్ళెంల ట్రయల్ రన్. SLBC సొరంగం పూర్తి చేసి తీరుతాం.

ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. 80 కోట్లతో.. 20 ఎకరాల్లో.. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మాణం. ఇండియన్ బిజినెస్ స్కూల్ మోడల్ లో.. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీ. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం. 30 ఏళ్లలో ఇలాంటి బడ్జెట్ చూడలేదు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 72 వేల కోట్లు. ఇది రైతు ప్రభుత్వం. బడ్జెట్ లో.. దక్షిణ తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత. SLBC, డిండి ఎత్తిపోతలు సహా సీతారామ ప్రాజెక్టులకు నిధులు. పంచాయతీరాజ్ కు భారీగా నిధులు.

కేంద్రం లెక్కల ప్రకారం.. తెలంగాణలో 16 లక్షల ఇళ్లకు తాగు నీరు లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. దక్షిణ తెలంగాణను మర్చిపోయారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని మీరు.. మా పార్టీని చీల్చి చెండాడుతారా? మీ అప్పులకు వడ్డీలు కడ్తున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీ ప్లాన్ చేస్తున్నాం” అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

 

Also Read : ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ట్రెండింగ్ వార్తలు