Apple CEO Tim Cook : భారత్‌లో రికార్డు స్థాయిలో ఐఫోన్ విక్రయాలు.. ఫస్ట్ టైమ్ శాంసంగ్‌‌ను అధిగమించిన ఆపిల్

Apple CEO Tim Cook : ఆపిల్ లేటెస్ట్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత కంపెనీ సీఈఓ టిమ్ కుక్ భారత మార్కెట్లో కంపెనీ పనితీరుపై అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Apple CEO Tim Cook : ఆపిల్ ఇటీవలే లేటెస్ట్ త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఆర్థిక పత్రాలలో మొదటి త్రైమాసికంగా చెప్పవచ్చు. ఐఫోన్ విక్రయాల్లో భారీ వృద్ధిని కొనసాగించిందని చూపించింది. దేశంలో రికార్డు త్రైమాసికంలో ఉందని కంపెనీ ప్రకటించింది. ఫలితాల తర్వాత ఎర్నింగ్స్ కాల్‌లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. భారత్ వ్యాపారం ఆదాయ పరంగా వృద్ధి చెందిందని, త్రైమాసిక ఆదాయ రికార్డును తాకిందన్నారు.

ముఖ్యంగా భారతీయ అభిమానులకు ఆపిల్ వీక్షకులకు, ఐఫోన్ విక్రయాల పెరుగుదలకు కంపెనీ ధన్యవాదాలు తెలిపారు. ఆదాయం పరంగా భారత్‌లో టాప్ మొబైల్ ఫోన్ కంపెనీగా ఆపిల్ శాంసంగ్‌ను అధిగమించిందని కౌంటర్‌పాయింట్ చేసిన రీసెర్చ్ నోట్ హైలైట్ చేసిన కొద్ది రోజుల తర్వాత కుక్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

ఆపిల్ సీఈఓ కుక్ ఇంకా ఏమన్నారంటే? :
మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీలలో ఆల్-టైమ్ రికార్డులతో పాటు భారత్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, చిలీలలో డిసెంబర్ త్రైమాసిక రికార్డులతో అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బలమైన రెండంకెల వృద్ధిని కొనసాగిస్తున్నామని ఆపిల్ ఫలితాలను ప్రకటించిన తర్వాత కుక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also : Apple iPhone 15 Deal : రూ.62వేల లోపు ధరలో ఆపిల్ ఐఫోన్ 15 సొంతం చేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఆపిల్ మొదటి ఆర్థిక త్రైమాసికంలో సంవత్సరానికి 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్ డాలర్ల త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఐఫోన్, మ్యాక్ సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. వేరబుల్ గాడ్జెట్లు, హోమ్ అప్లియన్సెస్ వంటివి గత కొంతకాలంగా సరికొత్త లాంచ్‌లను చూడలేదు. ఐప్యాడ్ తగ్గుముఖం పట్టాయి.

Apple CEO Tim Cook  

రాబోయే వారాల్లో ఆపిల్ కొత్త ఐప్యాడ్‌లను లాంచ్ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఆపిల్ ఐఫోన్ విక్రయాల ద్వారా డిసెంబరు త్రైమాసికంలో ఆదాయ వృద్ధిని సాధించింది. ఈ సేవలలో ఆపిల్ ఆల్-టైమ్ రెవెన్యూ రికార్డును నమోదు చేస్తోందని కుక్ చెప్పారు. ఇన్‌స్టాల్ చేసిన యాక్టివ్ డివైజ్‌ల బేస్ ఇప్పుడు 2.2 బిలియన్లను అధిగమించిందని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.

భారత్ మార్కెట్లో ఆపిల్ నెంబర్‌వన్ :
ఆపిల్ ఇండియా స్టోరీ బలంగా ఉందని రీసెర్చ్ ఏజెన్సీలు షేర్ చేస్తున్న మార్కెట్ నోట్స్ ద్వారా కూడా స్పష్టమైంది. కొద్ది రోజుల క్రితమే ఆపిల్ ఇప్పుడు ఆదాయం పరంగా భారత మార్కెట్లో నంబర్ వన్ మొబైల్ ఫోన్ కంపెనీగా ఉందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఆపిల్ భారత మార్కెట్‌పై దృష్టి సారించింది.

బ్రాండ్ షిప్‌మెంట్‌లలో 10-మిలియన్-యూనిట్ మార్కును అధిగమించి, క్యాలెండర్ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆదాయంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐఫోన్‌ల అమ్మకాలు, సొంత రిటైల్ షాపులను ప్రారంభించడం వంటివి పెద్ద-ఫార్మాట్ రిటైల్‌పై దృష్టిని పెంచిందని పరిశోధన విశ్లేషకుడు శుభమ్ సింగ్ కౌంటర్ పాయింట్ నోట్‌లో తెలిపారు.

Read Also : Nothing Phone 2a Launch : నథింగ్ ఫోన్ 2ఎ కొత్త మోడల్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్..!

ట్రెండింగ్ వార్తలు