హాట్ ఫొటోలతో…కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్న పూజా హెగ్డే

2014లో వరుణ్ తేజ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన ముకుందా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శాండిల్ వుడ్ బ్యూటీ పూజా హెగ్డే తన అందచందాలు,యాక్టింగ్ తో కుర్రాళ్ల గుండెళ్లో తిష్ఠ వేసుకుపోయింది. గతేడాది విడుదలైన రంగస్థలం మూవీలో జిగేల్ రాణి సాంగ్ తో అదరగొట్టేసిన పూజా హెగ్డే…యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేతలో ఆడిపాడింది.

ఎన్టీఆర్,మహేష్ బాబు,అల్లు అర్జున్,రామ్ చరణ్,వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన ఇప్పటికే నటించేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ తో కలిసి డీజే మూవీలో బికినీ లుక్ తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసిన ఈ అమ్మడు అల్లు అర్జున్ తో మరోసారి అల్లుఅర్జున్ తో అలవైకుంఠపురంలో జతకట్టింది. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురం సినిమాలో తన నటన,అందచందాలతో అందరినీ తనవైపు తిప్పేసుకుంది ఈ బ్యూటీ. జాన్ అనే తెలుగు సినిమాతో త్వరలో అతన అందాలు,అభియనంతో ఆకట్టుకునేందుకు సిద్దమవుతోంది పూజా. జాన్ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.

సినీ ఇండస్ట్రీలోని ఆల్‌రౌండర్లలో ఒకరైన పూజా హెగ్డే 2012లో తమిళ చిత్రం ముగమూడి ద్వారా నటిగా సీనీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటి నుండి తన ఫ్యాషన్ గేమ్‌, వెండితెరపై నటనతో భారీగానే అభిమానులను సంపాదించుకుంది.

2016లో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో మూవీలో నటించింది. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా రికార్డులు క్రియేట్ చేయకపోయినప్పటికీ పూజా యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. మొహంజోదారో తర్వాత హౌస్ ఫుల్4 లో కృతి కర్బంధా,రితేష్ దేశ్ ముఖ్,అక్షయ్ కుమార్,కృతిసనన్ లతో కలిసి పూజా హెగ్డే నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 278.78కోట్లు సంపాదించింది. అంతేకాకుండా బాలీవుడ్ లో హైయస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా హౌస్ ఫుల్ 4 నిలిచింది.

అయితే కేవలం తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో బిగ్ స్కీన్స్ పై అందరినీ ఎట్రాక్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలతో ఈ బ్యూటీ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

ట్రెండింగ్ వార్తలు