కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లు చూసేందుకు కుదరడం లేదు. ఇండియన్ క్రికెటర్లు టైమంతా ఇంట్లోనే గడిపేస్తున్నారు. ఇటీవల ముంబైలోని తన ఇంట్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు విరాట్. పైగా తనకు బౌలింగ్ వేస్తుంది మరెవరో కాదు భార్య అనుష్క శర్మ. ఇంటి బయట క్రికెట్ ఆడుతుండగా పక్క బిల్డింగ్ లో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
కోహ్లీ చివరిసారిగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో కనిపించాడు. 3వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉండగా అంతకంటే ముందే కరోనా వైరస్ ప్రభావం కనిపించింది. దీని ఫలితంగా సిరీస్ లు అన్నీ క్యాన్సిల్ చేసుకుంది టీమిండియా. అప్పటి నుంచి కోహ్లీతో పాటు జట్టు సభ్యులంతా ఇళ్లలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోయారు.
క్రికెట్ లేకపోవడంతో కోహ్లీ.. అతని భార్య అనుష్కలు కాస్త ప్రాక్టీస్ చేయాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. భర్త కోసం బాలీవుడ్ నటి బౌలింగ్ వేయడం మొదలుపెట్టింది. అనుష్క వేసిన బౌన్సర్ ను టీమిండియా కెప్టెన్ ఎలా ఫేస్ చేశాడో మీరు చూడండి. అంతకంటే ముందు కోహ్లీ కూడా అనుష్కకు అండర్ ఆర్మ్ డెలివరీలు వేశాడు.
Finally after soo much long time saw Virat Batting ?
Virat Anushka playing cricket in building today?
Anushka bowls a Bouncer to Virat?#ViratKohli #AnushkaSharma #Cricket pic.twitter.com/XFmfs3hiBt— Virarsh (@Cheeku218) May 15, 2020
చివరిసారిగా న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లలో కోహ్లీ తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. రెండు గేమ్ లలో 38పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ ను టీమిండియా 0-2తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ లో అయినా కనిపిస్తారనుకుంటే మహమ్మారి ప్రభావానికి ఆ ఆశలు కూడా ఆవిరైపోయాయి.
Read Here>>లంక పర్యటనకు సిద్ధమైన టీమిండియా