Ambati Rambabu: కంటికి ఎవరు కనపడ్డా ఆయన పచ్చ కండువా కప్పేస్తున్నారు: మంత్రి అంబటి

పిచ్చి పట్టినట్లు ఎవరికి పడితే వారికి పచ్చ కండువా కప్పుతున్నారని అంబటి విమర్శించారు.

Ambati Rambabu – Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌(YS Jagan)పై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పల్నాడు జిల్లా(Palnadu district)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పచ్చ కండువాలను లారీలో పెట్టుకుని కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నాయని చెప్పారు.

పిచ్చి పట్టినట్లు ఎవరికి పడితే వారికి పచ్చ కండువా కప్పుతున్నారని అంబటి విమర్శించారు. ఎవరైనా కన్నాకు కనపడితే వారికి పచ్చ కండువా కప్పుతారని, ఆయనకు కనపడకుండా దాక్కోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గతంలో తిట్టిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు మాత్రం ఆయన వెంటనే తిరుగుతున్నారని అన్నారు.

కన్నా లక్ష్మీనారాయణకు నైతిక విలువలు లేవని విమర్శించారు. రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థ మీద అనవసర రాద్ధాంతం చేసి, ధర్నాలకు దిగితే ఆయన సంగతి తేలుస్తానని హెచ్చరించారు. బెదిరించి పార్టీలో చేర్చుకునే కర్మ వైసీపీకి లేదని చెప్పారు. సత్తెనపల్లిలో పోటీ చేస్తారనే గ్యారంటీలేని వ్యక్తి కన్నా లక్ష్మీ నారాయణ అని అన్నారు.

CM KCR: సీఎం కేసీఆర్ రక్షాబంధన్ గిఫ్ట్.. వీవోఏలకు జీతాలు పెంపు

ట్రెండింగ్ వార్తలు