Supriya Sule: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులకు స్వతంత్రత లేదని, అసలు పనే లేదనే విమర్శలు అనేకం వస్తుంటాయి. అయితే మోదీ మంత్రివర్గంలోని రోడ్డు-రవాణా మంత్రి నితిన్ గడ్కరికి మాత్రం ఈ విమర్శల నుంచి మినహాయింపు ఉంది. మోదీ-షాల ఆధిపత్యాన్ని దాటుకొని ఆయన ఒక్కరే పని చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వంలో గడ్కరీ ఒక్కరే పని చేస్తున్నారని, దీనిపై తాను ఏ చర్చకైనా సిద్ధమంటూ ఆమె సవాల్ విసిరారు.
మోదీ చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునే పని తప్పితే ఇతర మంత్రులకు, బీజేపీ నేతలకు ఇంకే పని లేదని ఆమె ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ నేతలు ఈ విషయంలో బాగా ఆరితేరి పోయారని, వారికి అవార్డులు ఇవ్వొచ్చని ఆమె అన్నారు. గడ్కరీ నిక్కచ్చిగా పని చేస్తున్నారని, ఆయన పని చేస్తున్నప్పుడు పార్టీ అనుబంధాల గురించి కానీ, విధానాల గురించి ఆలోచించరని, మంత్రిగా ప్రజలకు చేయాల్సిన దాని గురించి శ్రద్ధ వహిస్తారని సుప్రియా కొనియాడారు.
Ram Mandir Defaced: రామమందిరంపై ఇండియాకు మోదీకి వ్యతిరేకంగా రాతలు