Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి పార్టీలో హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న జానారెడ్డి సేవలను వినియోగించుకొనేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైంది.

Jana Reddy

Telangana Congress Party: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకాగానే రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో తొలిజాబితా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ లో టికెట్ దక్కని, పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారినికూడా టికెట్ల కేటాయింపులో పరిగణలోకి అధిష్టానం తీసుకుంటుంది. వచ్చే వారం రోజుల్లో తొలిజాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో అసంతృప్తులు పార్టీని వీడకుండా ముందస్తు చర్యలను అధిష్టానం చేపట్టింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ గా పేరున్న జానారెడ్డిని పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది.

Read Also : Revanth Reddy : మీడియాలో వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు నిజం కావు, ఆ అధికారులను వదిలిపెట్టం- రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి పార్టీలో హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న జానారెడ్డిని రంగంలోకి దింపడం ద్వారా ఆయన సేవలను హైకమాండ్ పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు సిద్ధమైంది. జానారెడ్డి ఆధ్వర్యంలో ఫోర్ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో జానారెడ్డితో పాటు మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లను అధిష్టానం నియమించింది. ఈ కమిటీకి పార్టీ హైకమాండ్ కీలక టాస్క్ అప్పగించింది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత టికెట్ రానివారిని, పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతలు అప్పగించింది. బుధవారం జానారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గాంధీ భవన్ లో సమావేశంకానున్నారు. టికెట్ల కేటాయింపునకు ముందే టికెట్ కోసం పోటీ ఉన్న నియోజకవర్గాల పై ఈ కమిటీ దృష్టిసారించనుంది. తద్వారా టికెట్ దక్కని వారిని బుజ్జగించడం ద్వారా వారు పార్టీని వీడకుండాఉండేలా జానారెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ చర్యలు తీసుకోనుంది.

Read Also : CM KCR : కేసీఆర్ దూకుడు.. ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు

కాంగ్రెస్ పార్టీలో టికెట్లకోసం చాలా నియోజకవర్గంలో పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు, పాత నేతలు టికెట్ కోసం గట్టిగానే అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేతల మధ్యకూడా టికెట్ల కోసం పోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తుంది. టికెట్లు దక్కని కొందరు నేతలు పార్టీని వీడే అవకాశాలు ఉండటంతో వారిని బుజ్జగించి పార్టీలో కొనసాగేలా అధిష్టానం ముందుగానే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీనియర్ నేత జానారెడ్డి సేవలను అధిష్టానం వినియోగించుకోనుంది.

ట్రెండింగ్ వార్తలు