Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కొత్త కుర్రాడు రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 19వ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ప్రొడకన్ నెం.14 గా తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ, ‘రాధే శ్యామ్’ రాధాకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
కళ్యాణ్ రామ్, నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. డైరెక్టర్ రాజేంద్రకు స్క్రిప్ట్ అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలుపుతామని చిత్ర యూనిట్ అన్నారు.