Congress Working Committee: కాంగ్రెస్ టాప్ బాడీలోకి సచిన్ పైలట్, శశిథరూర్.. అసంతృప్తుల్ని ఈ విధంగా బుజ్జగిస్తున్నారా?

సీడబ్ల్యూసీలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ సహా మొత్తం 39 మంది నేతలు ఉన్నారు.

Congress Working Committee: కొద్ది రోజుల క్రితం వరకు అసంతృప్త నేతల్ని పూర్తిగా పక్కకు పెట్టేసిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా వారికి అత్యున్నత పదవులు ఇచ్చింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలో ఎలాంటి కలహాలు లేకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సహా మొత్తం 39 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ కొత్త కార్యవర్గం జాబితా విడుదలైంది.

Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌లో బాంబు పేలుడు.. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 11 మంది కార్మికులు మృతి

అయితే కాంగ్రెస్‌ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆనంద్ శర్మ, శశిథరూర్ లాంటి జీ-23కి చెందిన పలువురు నేతలకు ఈ వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం విశేషం. కాంగ్రెస్‌లో అతిపెద్ద నిర్ణయాధికార కమిటీ సీడబ్ల్యూసీ.. చాలా రోజుల కిందే ఏర్పాటు కావాలి. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త కమిటీలో పెద్దగా మార్పులు చేయలేదు. జాబితాను విడుదల చేయడానికి ముందు, గత కొన్ని నెలలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పలుమార్లు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.

Russia Luna25: జాబిలిని అందుకోలేకపోయిన రష్యా.. కుప్పకూలిన లూనా-25.. ఇక చంద్రయాన్-3?

సీడబ్ల్యూసీలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ సహా మొత్తం 39 మంది నేతలు ఉన్నారు. దీంతో పాటు 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ అధ్యక్షులకు స్థానం కల్పించారు. సచిన్ పైలట్, శశి థరూర్, అశోక్ చవాన్, దీపక్ బవారియాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కొత్తగా చేరారు. గౌరవ్ గొగోయ్, నాసిర్ హుస్సేన్, దీపా దాస్ మున్షీలను కూడా చేర్చారు. ప్రత్యేక ఆహ్వానితులలో పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాతే, అల్కా లాంబా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు