Hyderabad Metro: హైదరాబాద్ మహా నగరంలో మరో దశ మెట్రో నిర్మాణం ప్రారంభం కాబోతుంది. త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం జరగబోతుంది. ఎక్స్ప్రెస్ మెట్రో పేరుతో రానున్న ఈ నిర్మాణానికి డిసెంబర్ 9న తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు
ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొత్త మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. నగరంలోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఈ నిర్మాణం జరుగుతుంది. దీని మొత్తం పొడవు 31 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6,250 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Hyderabad is Forging Ahead
Happy to announce that Hon’ble CM KCR Garu will be laying the foundation for Airport Express Metro ? on 9th December
This project starting at Mindspace junction to Shamshabad Airport will be 31 KM long & will be costing approximately ₹6,250 Cr
— KTR (@KTRTRS) November 27, 2022