ఆంధ్రప్రదేశ్లో 8 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పోక్సో కేసుల విచారణ కోసమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.