అసని తుపాను.. దిశ మార్చుకుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో.. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా అసని దిశ మార్చుకున్న ప్రభావం.. కృష్ణా, గుంటూరు జిల్లాలపైనా పడింది. ఆ రెండు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కేంద్ర హోం శాఖ సైతం.. తాజా పరిస్థితిపై వాతావరణ శాఖతో నిరంతరం సంప్రదింపులు చేస్తోంది.