చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు.

  • Publish Date - March 5, 2020 / 01:25 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. రేవంత్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. జడ్జీ అయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డి లొంగిపోయారు. ఉప్పర్ పల్లిలోని జడ్జీ నివాసం నుంచి రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాల ఎగరవేత కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించి పక్కా ధారాలను సమర్పించారు. 14రోజుల రిమాండ్ లో రేవంత్ ను పోలీస్ కస్టడీకి కూడా పంపనున్నారు.

అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించిన కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆయన లొంగిపోయారు. ఐపీసీ 184, 187, 11, రెడ్ విత్ 5ఏ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు రేవంత్ కు గోల్కొండ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

శంషాబాద్ లో రేవంత్ రెడ్డిని గురువారం (మార్చి 5, 2020) పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులకు అరెస్టు చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ పై డ్రోన్ కెమెరాలు ఎగరవేశారన్న సమాచారంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ డ్రోన్ కెమెరా ఎక్కడి నుంచి ఆపరేషన్ జరిగిందన్న కోణంలో మొదటగా ఐదుగురి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ డ్రోన్ కెమెరాలను ఎగరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. 

మొదటగా ఐదుగురిని అరెస్టు చేసి వారిని విచారించిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారు. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత డ్రోన్ కెమెరాల ఆపరేషన్ జరిగిందని స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.