నకిలీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉభయగోదావరి జిల్లాల్లో నకిలీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పులి వెంకటరావు, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరు… నకిలీ ఆధార్ కార్డులతో బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి… ఫైనాన్స్పై ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని బయట అమ్ముకొని డబ్బు తీసుకుంటారు.
ఈ ఇద్దరు కూడా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలుసహా పలు ప్రాంతాల్లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుని పరారయ్యారు. పంగిడిలోనూ ఇదే తరహా మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వెంకటరావు తనతోపాటు ఒడిశాకు చెందిన మరో ముగ్గురికీ ఇదే తరహాలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఇప్పించాడు.
అందరూ కలిసి ఆ వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బును పంచుకున్నారు. ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు వెంకటరావు, శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు. వారి నుంచి పలు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు ఒడిశా వారికోసం గాలిస్తున్నారు.