ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి శుక్రవారం (ఏప్రిల్ 12, 2019) విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి శుక్రవారం (ఏప్రిల్ 12, 2019) విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను విడుదల చేయనున్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు రిజల్స్ట్ ను రిలీజ్ చేస్తారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్తోపాటు ఇతర వెబ్సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఫస్ట్ టైమ్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేస్తున్నారు.
Read Also : చెక్ చేసుకోండి : ఏపీ ఇంటర్ ఫలితాలు
ఫలితాల కోసం వెబ్ సైట్లు:
https://results.apcfss.in
http://bieap.gov.in
https://jnanabhumi.ap.gov.in
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు సెకండియర్ పరీక్షలు జరిగాయి. 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ నుంచి 5,07,302 మంది విద్యార్థులు.. సెకండియర్ నుంచి 5,10,298 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది(2019) ఫస్ట్ టైమ్.. ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేస్తున్నారు.
2018లో ఫస్టియర్ కి గ్రేడింగ్ విధానం అమలు చేయగా.. ఈసారి సెకండియర్ ఫలితాలను గ్రేడింగ్లో విడుదల చేస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ.. గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
Read Also : ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ