టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల అయింది.
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. ప్రచారంలో భాగంగా రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు.
మార్చి 27 బుధవారం రాజన్న సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలంలో, 29న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలో రోడ్షో నిర్వహించనున్నారు. మార్చి 30న నర్సంపేట, ములుగులో బహిరంగ సభలు, అదే రోజు తాండూరు, వికారాబాద్లో కూడా కేటీఆర్ పర్యటించనున్నారు. 31న రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట మండలం, వికారాబాద్ జిల్లాలోని పరిగి, చేవెళ్లలో పర్యటన చేయనున్నారు.
ఏప్రిల్ 1న ఎల్బీనగర్, మహేశ్వరంలో రోడ్షోలు, ఏప్రిల్ 2న సిరిసిల్ల రూరల్, ఉప్పల్, మల్కాజ్గిరిలో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. 3న హుజుర్నగర్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్లో రోడ్షోలు నిర్వహించనున్నారు. 4న ఇబ్రహీంపట్నంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించి, అంబర్పేట, ముషీరాబాద్లో రోడ్షోలో పాల్గొననున్నారు.
5న కోదాడలో బహిరంగ సభ, సికింద్రాబాద్, సనత్నగర్లో రోడ్షోలు ఉండనున్నాయి. ఏప్రిల్ 6న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్షోలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్లో నిర్వహించే సభలతోపాటు రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసే రోడ్షోల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. 8న ఇల్లెందు, పినపాకలో బహిరంగ సభలు, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో రోడ్షోలు ఉంటాయి. ఏప్రిల్ 9న నల్లగొండలో కేటీఆర్ రోడ్షోలో పాల్గొని, ప్రచారం చేయనున్నారు.