Corona Vaccine Distribution: ఇండియాలో జనవరి 16నుంచి కరోనావ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతస్థాయిలో జరిగిన సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. తొలుత 3కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. తొలి దశలో 27కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండో దశలో 50ఏళ్లు పైబడిన, కరోనా లక్షణాలున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.