IndVsEng: చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ ఇరగదీసిన మైదానం వేదికగా ఆడిన ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆర్చర్ బౌలింగ్లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్ రోహిత్(6) పరుగులకే కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 19 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకున్న భారత్ ఆ తర్వాత శుభమన్ గిల్(29) కూడా ఆర్చర్ బౌలింగ్లోనే అండర్సన్ చేతికి చిక్కాడు. అలా 44 పరుగులకే భారత్ రెండో వికెట్ కూడా కోల్పోయింది. లంచ్ విరామానికి 14ఓవర్లకు టీమిండియా స్కోరు 59/2గా నమోదైంది.
రెండో సెషన్లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 11 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైయ్యాడు. డామ్ బెస్ వేసిన 25వ ఓవర్నాలుగో బంతి విరాట్ బ్యాట్ ఎడ్జ్కు తాకి షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ఓలీ పోప్ చేతుల్లో పడటంతో అవుట్ అయ్యాడు. భారత్ 71 పరుగుల వద్ద మూడో వికెట్ను కూడా కోల్పోవాల్సి వచ్చింది.
అప్పుడే క్రీజులోకి వచ్చిన రహానె కేవలం ఒక్క పరుగు చేసి తిరిగి వెళ్లిపోయాడు. ఫలితంగా 73 పరుగులకే నాలుగో వికెట్ను చేజార్చుకుని కష్టాల్లోకి కూరుకుపోయింది. అనంతరం చతేశ్వర్ పుజారా, పంత్ దూకుడుగా ఆడుతూ టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టీ విరామానికి స్కోరు 154/4 వరకూ చేర్చగలిగారు.
మూడో సెషన్లో పుజారా, పంత్ ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. టీ20ని తలపించేలా దూకుడును ప్రదర్శించారు. 50.4ఓవర్లో 192 పరుగులు వద్ద బెస్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు పంత్. అప్పటికి స్కోరు 225. మూడో రోజు ఆటముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసిన టీమిండియా 321 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో అశ్విన్(8), వాషింగ్టన్ సుందర్(33) నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డొమినిక్ బెస్(4), ఆర్చర్(2) వికెట్లు తీశారు. అంతకుముందు ఇంగ్లాండ్ ఆడిన ఇన్నింగ్స్లో 578 పరుగులకు ఆలౌట్ అయింది.