అద్దింట్లో ఉండేవాళ్లకు కరెంట్ బిల్లుపై నో జీఎస్టీ
- Subhan Ali Shaik
- Published On : January 21, 2021 / 02:06 PM IST
Electricity Charges: అద్దె ఇళ్లలో ఉండే వాళ్ల కరెంట్ బిల్లులపై నో జీఎస్టీ అని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. నర్మద వాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గుజరాత్ ఏఏఆర్ ను కలిసి సబ్ మీటర్లపై వచ్చిన కరెంట్ బిల్లులను చెల్లించి అద్దెకు ఉండే వాళ్లు చెల్లించినట్లుగా చూపించాడు. జీఎస్టీ కాన్సెప్ట్ ప్రకారం.. కస్టమర్ కు సర్వీస్ ఇచ్చేటప్పుడు జీఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అలా చేసేవారిని ఒక ప్యూర్ ఏజెంట్ గా మాత్రమే చూస్తారు.
‘ఇంటి ఓనర్ ఎలక్ట్రిక్ పవర్ ను నేరుగా వాడుకునేటప్పుడు జీఎస్టీ చెల్లించాలి. అదే అద్దెకు ఉండేవాళ్లకు ఎలక్ట్రిక్ సప్లై చేస్తున్నప్పుడు సెక్షన్ 15(2)(సీ)కిందకు వస్తుంది’
సబ్ మీటర్లపై వచ్చే కరెంట్ బిల్లుల విషయంలో ల్యాండ్ ఓనర్లు ప్యూర్ ఏజెంట్లుగానే వస్తారు. అలా అయితే అద్దెకు ఉండే వాళ్ల విషయంలో వారు కరెంటు బిల్లులపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని క్లియర్ చేసింది. దీనిపై హర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి.. ట్యాక్స్ పేయర్లను ఆకర్షించడానికి ఇదొక కొత్త పక్రియగా అభివర్ణించారు.
