ఆన్‌లైన్ వేధింపులపై కేసు – పోలీసులకు అనసూయ థ్యాంక్స్

సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తనను వేధిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన యాంకర్ అనసూయ..

  • Publish Date - February 10, 2020 / 07:39 AM IST

సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తనను వేధిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన యాంకర్ అనసూయ..

ప్రముఖ యాంకర్, నటి అనసూయ తనకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనపై సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైన కామెంట్స్, వెకిలి చేష్టల పట్ల విసుగు చెందానని ట్విట్టర్ ద్వారా సైబర్ పోలీసులకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శృతిమించుతున్న అసభ్యకరమైన కామెంట్స్ పట్ల స్పందించకపోతే సహనానికి అర్ధం ఉండదని అనసూయ ట్వీట్ చేస్తూ సైబర్ క్రైమ్ వారిని ట్యాగ్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. కేసు నమోదు చేసుకున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పోలీసువారి స్పందనకు అనసూయ కృతజ్ఞతలు తెలిపారు.

బుల్లితెరపై ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.. ‘సోగ్గాడే చిన్నినాయనా’,  ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.  
 

ట్రెండింగ్ వార్తలు