ముగ్గురు పిల్లలకు తల్లినయ్యా.. ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు..

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేశారు..

  • Publish Date - April 11, 2020 / 01:09 PM IST

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేశారు..

కరోనా మహమ్మారి వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు, పోలీసు, వైద్య, పారిశుద్ధ్య బృందాలు పడుతున్న కష్టం వర్ణనాతీతం. ఈ విపత్కర పరిస్థితి ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. తాజాగా బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ ఈ పరిస్థితులను తలచుకుంటూ చేసిన ఎమెషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2011లో పెళ్లి చేసుకున్న సెలీనా ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ‘Season’s Greetings’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 15నుండి Zee5లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో పెళ్లి అయిన తర్వాత నుండి ఇప్పటివరకు తన జీవితంలో జరిగిన మార్పులను గుర్తు చేసుకుంటూ.. భర్త, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ సెలీనా ఓ పోస్ట్ చేసింది. ‘‘సినిమాకు సంబంధించి నా 2011లో చివరి పోస్ట్ షేర్ చేశాను. మళ్లీ నా తర్వాతి సినిమా పోస్టును పంచుకోవడానికి ఇన్నేళ్లు పడుతుందని, అది కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అని నేను అస్సలు ఊహించలేదు. అలాగే ఒక చిన్న వైరస్‌ కారణంగా ప్రపంచమంతా మూసివేయ బడుతుందని కూడా అనుకోలేదు.

Read Also : బాధ్యత ఉండక్కర్లా?.. సోనమ్‌పై రష్మీ ఫైర్..

నా ప్రతి సినిమాపై ఎప్పటి లాగే వారి అభిప్రాయం చెప్పే నా తల్లిదండ్రులు సజీవంగా ఉండరని.. ఇక నేను వివాహం చేసుకుని యూరప్‌లో నివసిస్తానని, నా తర్వాతి చిత్రం ఓ ముగ్గురి పిల్లలకు తల్లి అయ్యాక వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు.. నా ప్రయాణంలోని ఈ సీజన్లలో జీవితం అనూహ్యమని నేను తెలుసుకున్నాను. మనం రేపు కోసం వేచి ఉండకుండా.. ఈ రోజును ఉత్తమంగా చూడాలి. ఈ లాక్‌డౌన్‌లో మా చిత్రం ఖచ్చితంగా వినోదాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. 2004లో మంచు విష్ణుతో ‘సూర్యం’ సినిమాలో నటించింది సెలీనా.

ట్రెండింగ్ వార్తలు