వర్మ సినిమా విడుదలకు హైకోర్టు మరోసారి బ్రేక్..

రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు మరోసారి బ్రేక్ వేసిన హైకోర్టు..

  • Publish Date - December 11, 2019 / 11:06 AM IST

రామ్ గోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు మరోసారి బ్రేక్ వేసిన హైకోర్టు..

రామ్ గోపాల్ వర్మ చిత్రం విడుదలకు హైకోర్టు మరోసారి బ్రేక్….

కాంట్రవర్సీకింగ్ రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన ఏపీ రాజకీయాలపై సినిమా మొదలు పెట్టాడో కానీ.. వివాదాల మీద వివాదాలు.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. డిసెంబర్ 12న విడుదల కావలసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంపై పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు చిత్ర యూనిట్..

సెన్సార్ బోర్డు, చిత్ర యూనిట్ సభ్యులు పిటీషన్‌పై కౌంటర్ ధాఖలు చేశారు. చిత్రంలో ఉన్న అభ్యంతరాలు అన్ని తీసేశామని మూవీ యూనిట్ కోర్టుకు తెలియచేయగా.. 
తీసి వేసినట్టు ఎక్కడా లేదని కేవలం మ్యూట్‌లో ఉంచారని మాత్రమే కౌంటర్‌లో పేర్కొన్నారని హైకోర్ట్ చెప్పింది.. మ్యూట్‌లో ఉంచలేదని కొన్ని సన్నివేశాలను డిలీట్ కూడా చేసామని, బోర్డు సూచనల మేరకు ఛానెల్స్ యొక్క లోగోలను కూడా తొలగించామని కోర్టుకు చిత్ర యూనిట్ చెప్పారు.

ఎగ్జామినేషన్ కమిటీ చిత్రాన్ని మత పరమైన అంశాలతో పాటు, ఒక వర్గాన్ని కించపరిచే లా ఉందని, శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం అప్రూల్ చేయలేమని కౌంటర్ పేర్కొన్నారని తేల్చి చెప్పింది హైకోర్టు. రివ్యూ కమిటీ ఇప్పటికే చిత్ర యూనిట్‌కు షోకాజ్ నోటీసులు ఇచిందని, రివ్యూ కమిటీ ఇంకా చిత్రాన్ని పరీశీలించలేదని అడిషనల్ సోలిసిటర్ జనరల్ తెలిపారు. చిత్రం రివ్యూ కమిటీ పరిధిలో ఉందని ఇప్పుడు తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని, రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే అన్ని సక్రమంగా ఉన్నట్లయితేనే ఆర్డర్ పాస్ చేయాలని రివ్యూ కమిటిని హైకోర్టు ఆదేశించింది.