కంగనాలో కొత్త కోణం – షాకవుతున్న జనం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తమిళనాడు రామేశ్వరంలోని శివుడిని దర్శించుకున్నారు..

  • Publish Date - February 24, 2020 / 12:59 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తమిళనాడు రామేశ్వరంలోని శివుడిని దర్శించుకున్నారు..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనే విషయం తెలిసిందే. చిన్న వయసులోనే మూడు నేషనల్ అవార్డ్స్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కంగనా మంచి నటి అనే సంగతి పక్కన పెడితే ఆమెలోని కాంట్రవర్షియల్ కోణం గురించి కూడా అందరికీ తెలిసిందే. 

తన మనసుకి అనిపించిన మాటను అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తుంది. ఇంత అగ్రెసివ్‌గా కనిపించే కంగనా రీసెంట్‌గా ట్రెడిషనల్ వేర్‌లో దేవుణ్ణి దర్శించుకుంటూ కనబడింది. తమిళనాడు రామేశ్వరంలోని శివుడి గుడిలో కంగనా ప్రత్యేక పూజలు చేసింది.

Read More>>‘గంగూలీ’ బయోపిక్‌

వేకుమజామునే పుణ్యస్నానమాచరించి శివయ్య ఆశీస్సలు అందుకుంది. అనంతరం దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం మెమోరియల్ సైట్‌ని సందర్శించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగనా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’, తో పాటు ‘తేజస్’ సినిమాలోనూ నటిస్తుంది. 

ట్రెండింగ్ వార్తలు