ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. నుండి విలక్షణ నటుడు ఆర్.మాధవన్ లుక్ విడుదల చేసిన మూవీ టీమ్..
విలక్షణ నటుడు ఆర్.మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు).. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్పై.. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. అనుష్క లుక్కి మంచి స్పందన వచ్చింది. దసరా సందర్భంగా ‘నిశ్శబ్దం’ నుండి మాధవన్ లుక్ రిలీజ్ చేశారు.
మ్యాడీ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్గా కనిపించనున్నాడు. వయోలిన్ ప్లే చేస్తున్న మాధవన్ లుక్.. ‘డీడీఎల్’ మూవీలో షారుఖ్ ఖాన్ను గుర్తు చేస్తుంది. హెయిర్కు కలర్, వైట్ గెడ్డంతో మాధవన్ లుక్ ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. నలుగురు ఇండియన్స్కి అమెరికా పోలీసులకు మధ్య జరిగే క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు.
Read Also : క్లాస్, మాస్ ఆ రెండింటికీ బాలయ్య బాస్ : ‘NBK 105’ న్యూ పోస్టర్!
‘కిల్ బిల్’ మూవీలో విలన్గా నటించిన మైఖేల్ మ్యూడిసన్తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు నటించారు. డిసెంబర్ లేదా 2020 జనవరిలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చెయ్యనున్నారు.