పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఏ.ఏం.రత్నం నిర్మిస్తున్న పీరియాడికల్ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ కాంబినేషన్లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఏ. ఏం.రత్నం నిర్మిస్తున్న సినిమా.. బుధవారం ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
‘ఖుషి’, ‘బంగారం’ సినిమాల తర్వాత పవన్, ఏ. ఎం.రత్నం కలయికలో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. పవన్ 27వ సినిమాను దేవుని పటాలపై క్లాప్తో లాంచనంగా ప్రారంభించారు. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
Read Also : సోదరి మరణం – విషాదంలో కింగ్ఖాన్ కుటుంబం
దర్శకుడు క్రిష్, ఈ సినిమాలో పవన్ని ఓ కొత్త తరహా పాత్రలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాకి సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : జ్ఞాన శేఖర్.