శ్రీదేవి వర్థంతి – జాన్వీ భావోద్వేగం

ఫిబ్రవరి 24.. అతిలోక సుందరి శ్రీదేవి రెండవ వర్థంతి సందర్భంగా జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు..

  • Publish Date - February 24, 2020 / 09:25 AM IST

ఫిబ్రవరి 24.. అతిలోక సుందరి శ్రీదేవి రెండవ వర్థంతి సందర్భంగా జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు..

ఫిబ్రవరి 24.. మహానటి, ప్రేక్షకాభిమానులతో అతిలోకసుందరి అని పిలిపించుకున్న శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2018లో శ్రీదేవి కన్నుమూసినప్పటికీ, ఈ నాటికి ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి రెండవ వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీకపూర్ ఒక పోస్ట్ చేసింది.

జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన తల్లితో పాటు ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో జాన్వీ తన తల్లి శ్రీదేవిని ఆలింగనం చేసుకుని కనిపిస్తోంది. ఆ ఫోటో కింద జాన్వీ ‘నేను నిన్ను ప్రతీరోజూ మిస్ అవుతున్నానని’ రాసింది.

ఈ ఫొటోను చూసిన శ్రీదేవి అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు. శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు