మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ టైటిల్ ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ టైటిల్ ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్లు హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర
ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ దక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని భావిస్తున్న సాయి ధరమ్ తేజ్ తన పేరును కూడా సాయి తేజ్ మార్చుకున్నాడు. మరి ఈ సినిమాతో అయిన సాయి తేజ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Read Also : ప్రధాని కార్యాలయంలోనే ఉండగానే భారీ అగ్నిప్రమాదం