మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో శృతి హాసన్ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు..
మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా రవితేజకిది 66వ సినిమా.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్కి రెడీ అయ్యాడు.
‘డాన్ శీను’తోనే గోపిచంద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రవితేజ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇంతకుముందు ‘బలుపు’ లో రవితో ఆడిపాడింది శృతి.. రవితేజ, గోపిచంద్తో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇది.
Read Also : నాగబాబు బర్త్డే సెలబ్రేషన్స్ : మెగా ఫ్యామిలీ హంగామా మామూలుగా లేదుగా!
‘కాటమరాయుడు’ తర్వాత శృతి తెలుగులో చేస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమా నవంబర్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Welcoming ..the multi talented actress @shrutihaasan on board ??? #RT66 pic.twitter.com/Coym47HUDF
— Gopichand Malineni (@megopichand) October 30, 2019