కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: గోడ కూలి నలుగురు మృతి 

  • Publish Date - August 23, 2019 / 06:48 AM IST

శ్రీ కృష్ణా జన్మష్టమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ విషాదం నెలకొంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 27మంది తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల..తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు  చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం మమతా ఆకాంక్షించారు.

ట్రెండింగ్ వార్తలు