శ్రీ కృష్ణా జన్మష్టమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ విషాదం నెలకొంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ క్రమంలో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 27మంది తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల..తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం మమతా ఆకాంక్షించారు.
West Bengal: 4 dead & 27 injured after a wall of a temple, where people were gathering to celebrate #Janmastami, collapsed in Kachua, North 24 Pargana, earlier today. pic.twitter.com/L31UrWoEa2
— ANI (@ANI) August 23, 2019
West Bengal CM Mamata Banerjee has announced a compensation of Rs. 5 lakhs for the family of the deceased, Rs.1 lakh for those who got critically injured and Rs. 50,000 for others with minor injuries. https://t.co/95RZP5PNTf
— ANI (@ANI) August 23, 2019