Shaukat Ali: ఒకర్నే పెళ్లి చేసుకుంటారు, కానీ ముగ్గురితో సంబంధం ఉంటుంది.. హిందువులను ఉద్దేశించి ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తాము హిందువులను పెళ్లి చేసుకుని సామాజిక స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తే.. వారు మాత్రం తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వాస్తవానికి ముఘల్ రాజుల ముందు గులాము చేసిన వారే నేడు తమను బెదిరిస్తున్నారని అలీ అన్నారు. ‘‘832 ఏళ్లు మేము మిమ్మల్ని పాలించాం. మీరంతా చేతులు కట్టుకుని వెనక్కి నిలబడి జీ హుజూర్ అన్నారు. కానీ ఈరోజు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకంటే సెక్యూలర్ ఎవరున్నారు? ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినా, ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చలేదు’’ అని అలీ అన్నారు.

A Owaisi Party Leader Charged For Hindus Remark

Shaukat Ali: పరోక్షంగా హిందువులను ఉద్దేశించి ఏఐఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు ఒకర్నే పెళ్లి చేసుకుంటావు. కానీ ముగ్గురితో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కంటుంటావు’’ అంటూ ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం నేత షౌకత్ అలీ అన్నారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని చెడగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కోణంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం.. ‘‘భారతీయ జనతా పార్టీ ఓడిపోయినప్పుడల్లా ముస్లింల మీద పడుతుంది. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, వారికి ఎక్కువ మంది భార్యలు ఉంటారని అంటారు. నిజమే మేము రెండుసార్లు పెళ్లి చేసుకుంటాం. కానీ ఇద్దరు భార్యల్ని ఒకేలా చూస్తాం. కానీ, మీరు పేరుకు ఒకర్నే పెళ్లి చేసుకుంటారు. కానీ తెలియకుండా మూడు, నాలుగు సంబంధాలు ఉంటాయి. వారితో పిల్లల్ని కూడా కంటారు. కానీ వీరిలో ఎవరికీ కనీస గౌరవం ఇవ్వరు’’ అని షౌకత్ అలీ అన్నారు.

ఇక జోదాను అక్బర్ పెళ్లి చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. తాము హిందువులను పెళ్లి చేసుకుని సామాజిక స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తే.. వారు మాత్రం తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వాస్తవానికి ముఘల్ రాజుల ముందు గులాము చేసిన వారే నేడు తమను బెదిరిస్తున్నారని అలీ అన్నారు. ‘‘832 ఏళ్లు మేము మిమ్మల్ని పాలించాం. మీరంతా చేతులు కట్టుకుని వెనక్కి నిలబడి జీ హుజూర్ అన్నారు. కానీ ఈరోజు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకంటే సెక్యూలర్ ఎవరున్నారు? ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినా, ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చలేదు’’ అని అలీ అన్నారు.

కాగా, షౌకత్ అలీపై భారత శిక్ష స్మృతిలోని సెక్షన్ 153ఏ, 295ఏ, 188 కింద కేసులు నమోదు చేసినట్లు సంభాల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఛక్రేష్ మిశ్రా ఆదివారం తెలిపారు.

PDP Chief Mufti: కశ్మీరి యువతకు ఉద్యోగానికి బదులు మందు బాటిళ్లు ఇస్తున్నారు.. మాజీ సీఎం ముఫ్తీ విమర్శలు