Amit Shah: వీధి గోడలపై కమలం బొమ్మలు గీసిన కేంద్రమంత్రి అమిత్ షా
కర్ణాటకలో అమిత్ షా పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. శనివారం హుబ్బలి, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తారు. గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఆయన మాండ్యా జిల్లా, బెంగళూరు పర్యటన నిర్వహించారు. ఈసారి కిత్తూరు-కర్ణాటక ప్రాంతం అని కూడా పిలువబడే హుబ్బల్లి-ధార్వాడలో పర్యటిస్తున్నారు. కుందగోల్లోని బీజేపీ విజయ సంకల్ప అభియానలో షా పాల్గొని నగరంలోని శంబులింగేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు.
- tony bekkal
- Published on- January 28, 2023 / 07:37 PM IST
Union Home Minister Amit Shah paints the party's 'lotus' in Dharwad area
Amit Shah: పర్యటన నిమిత్తం శనివారం కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రస్తుతం దర్వాడ్ ప్రాంతంలో తొలిరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక వీధిలోని గోడపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం బొమ్మ వేసి బీజేపీ అని రాశారు. ఈ యేడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సందర్భంగా అమిత్ షా ఎంట్రీతో ప్రచారం ప్రారంభించింది బీజేపీ. ఇందుకోసమే అమిత్ షా రాష్ట్రానికి వచ్చినట్లు బీజేపీ వర్గీయుల సమాచారం.
Adani LIC Shares : అదానీ గ్రూప్ ఎఫెక్ట్.. ఎల్ఐసీ పరిస్థితి ఏంటి? ప్రమాదంలో కోట్లాది మంది బీమా సొమ్ము
ఇక కర్ణాటకలో అమిత్ షా పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. శనివారం హుబ్బలి, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తారు. గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఆయన మాండ్యా జిల్లా, బెంగళూరు పర్యటన నిర్వహించారు. ఈసారి కిత్తూరు-కర్ణాటక ప్రాంతం అని కూడా పిలువబడే హుబ్బల్లి-ధార్వాడలో పర్యటిస్తున్నారు. కుందగోల్లోని బీజేపీ విజయ సంకల్ప అభియానలో షా పాల్గొని నగరంలోని శంబులింగేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు.
Amrit Udyan: రాష్ట్రపతి భవన్లోని ముఘల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్గా మార్చిన కేంద్రం
