Jio Launches 6 New Jiofiber Plans Starting At Rs 399 With Zero Installation Fee
JioFi: రిలయన్స్ జియో తన JioFi 4G వైర్లెస్ హాట్స్పాట్ కొనుగోలుతో మూడు కొత్త పోస్ట్పెయిడ్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్లాన్ల ధర రూ. 249, రూ. 299, వివిధ డేటా పరిమితులతో రూ.349. బేస్ ప్లాన్ 30GB డేటాతో వస్తుంది. రూ. 299, రూ. 349 రీఛార్జ్ ప్లాన్లు వరుసగా 40GB, 50GB డేటాను అందిస్తాయి. మూడు ప్లాన్లు నెల వాలిడిటీతో మాత్రమే వస్తున్నాయి.
కాకపోతే 18 నెలల లాక్-ఇన్ వ్యవధితో ఎలాంటి వాయిస్ లేదా SMS ప్రయోజనాలను కలిగి ఉండవు. ఎంటర్ప్రైజ్ లేదా బిజినెస్ కస్టమర్లను లక్ష్యంగా ఈ ప్లాన్ల కింద కస్టమర్లు పోర్టబుల్ JioFi పరికరాన్ని ఉచితంగా పొందవచ్చు. ఇది యూజ్ అండ్ రిటర్న్ ప్రాతిపదికన జారీ చేయనున్నట్లు తెలిపారు.
జియో వెబ్సైట్ ప్రకారం, కొత్త రూ. 249 పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ నెల వాలిడిటీతో 30GB డేటాను. రూ. 299 పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 40GB డేటాకు యాక్సెస్ను, రూ. 349 ప్లాన్ 50GB డేటాను క్రెడిట్ చేస్తుంది. డేటా వాడకం పరిమితి దాటిన తర్వాత వేగం 64Kbpsకి తగ్గిపోతుంది.
JioFi 4G వైర్లెస్ హాట్స్పాట్ SIM (నానో)కి సపోర్ట్ చేస్తుంది కూడా. 150Mbps వేగంతో 5 నుండి 6 గంటల వరకు సర్ఫింగ్ను అందించగలదని కూడా వెల్లడించారు. ఒకేసారి పది డివైజ్లకు కనెక్ట్ అవుతుందని చెప్పారు. JioFi 4G హాట్స్పాట్ డివైజ్, మైక్రో-USB పోర్ట్, కనెక్టివిటీ కోసం మైక్రో SD కార్డ్తో వస్తుంది. ఇది 2,300mAh బ్యాటరీతో పనిచేస్తుంది.