Odisha : లోయలో పడ్డ బస్సు..9 మంది మృతి..40 మందికి గాయాలు

  • Publish Date - January 29, 2020 / 04:57 AM IST

ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్‌ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తిక్రి నుంచి బెర్హంపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని బెర్హంపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. పొగమంచు కారణంగానే బస్సు ప్రమాదం జరిగిందని గంజం ఎస్పీ బ్రిజేష్ రాయ్ తెలిపారు.  దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.