Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీ రాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరుకావాలంటూ ఈడీ తాజాగా నోటీసు ఇచ్చింది.
రాహుల్ గాంధీ ప్రస్తుతం ఇండియాలో లేకపోవడంతో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. గురువారం నాడు హాజరుకావాల్సిన ఈడీ విచారణకు రాలేకపోతున్నానని రాహుల్ సమాచారం పంపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భూకబ్జాలతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
Read Also: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ డైరక్టర్గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరుకావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు.
సోనియాగాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. జూన్ 8న ఈడీ విచారణకు సోనియా హాజరవుతారతారని సూర్జేవాలా చెప్పారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఇరువురి వాంగ్మూలాలూ రికార్డ్ చేయనున్నట్లు తెలిపింది ఈడీ.