No Confidence Motion: మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్న స్పీకర్.. పార్లమెంటులో ఏం జరిగిందో తెలుసా?

దీనికి ముందు లోక్‭సభలో మోదీ మాట్లాడుతూ.. విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోందని అన్నారు. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు

PM Narendra Modi: అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లోక్ సభకు హాజరై ప్రసంగించారు. విపక్షాలు ప్రజల సమస్యలపై కాకుండా రాజకీయాల కోసమే పార్లమెంట్ సమావేశాన్ని వృధా చేస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు. అయితే విపక్షాలు ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున అదే పనిగా నినాదాలు చేశారు. దీంతో మోదీ ప్రసంగాన్ని స్పీకర్ ఓంబిర్లా ఒక్కసారిగా ఆపేశారు.

No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ

ఇరు పక్షాలు శాంతంగా ఉండాలని, ప్రధానమంత్రి ప్రసంగం కొనసాగుతోందని, ఆయన పూర్తిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలోని ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇక చేసేదేమీ లేక మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Snake: ఆకాశం నుంచి మహిళపై పడి చేతిని చుట్టేసిన పాము.. ఆ తర్వాత మరో విచిత్ర ఘటన

దీనికి ముందు లోక్‭సభలో మోదీ మాట్లాడుతూ.. విపక్షాలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోందని అన్నారు. విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని తమ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశ పెట్టారంటూ ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్ కాదని, అది విపక్షాలకు ఫ్లోర్ టెస్టని అన్నారు. విపక్షాల అవిశ్వాస ప్రస్తావన తమకు ప్రయోజనకరమని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో తమపై అవిశ్వాసం పెట్టారని, అయితే అది ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చిందని మోదీ అన్నారు.