కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో భారత క్రికెటర్లు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ యూవీలకు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ఫోటో పై యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. రోహిత్ శర్మ తన భార్యతో కలిసిన దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ‘మీరు ప్రేమించే దానిని ఎల్లప్పుడు పట్టుకునే ఉండండి’ అనే క్యాప్షన్ తో పంచుకున్నాడు.
యువరాజ్ సింగ్, రోహిత్ తరచుగా ఒకరినొకరు సోషల్ మీడియాలో ఆటపట్టించుకుంటూనే ఉంటారు. గత మే నెల 1, 2020 న తేదీన యువీని రోహిత్ ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30, 2020 న రోహిత్ 33వ బర్త్ డే సందర్భంగా అతనికి ప్రస్తుత జట్టు సభ్యులు, మాజీ క్రికెటర్లందరు విషెస్ తెలిపారు. దీనికి రోహిత్ స్పందిస్తూ‘థాంక్యూ సో మచ్ గయ్స్.. కానీ యువీకి లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగా తగిలినట్టుగా ఉంది. అతని హెయిర్ లో కనిపిస్తుందని’సెటైర్లు వేశాడు రోహిత్. ప్రస్తుతం యువీ సెటైర్ కి రోహిత్ ఏవిధంగా సమాధానం చెబుతాడో చూద్దాం.
Read Here>>భారత డిజిటల్ రంగంలో చైనా కంపెనీల ఆధిపత్యం ఎంతలా ఉందంటే?