Rajiv Yuva Vikasam 2026 : రాజీవ్ యువ వికాసంపై కీలక అప్డేట్.. త్వరలోనే వారందరికీ రూ.3 లక్షలు
Rajiv Yuva Vikasam 2026 : రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎదురు చూస్తోన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక త్వరలోనే వారందరికీ రూ.3 లక్షలు ఇవ్వనుంది.
- Dharani Pilli
- Published On : March 20, 2026 / 03:33 PM IST
telangana budget 2026 government allocate rs 6000 cr for rajiv yuva vikasam scheme
Rajiv Yuva Vikasam 2026 : తెలంగాణలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు గాను వారికి ఆర్థిక సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన యువతీయువకులు వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారికి సబ్సిడీ కింద లోన్లు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ పథకం కోసం నిరుద్యోగ యువతీయువకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది.
నేడు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో రేవంత్ సర్కార్ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా యువతకు ఎక్కువగా 3 లక్షల రూపాయల లోన్స్ ఇవ్వాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.
ఈ పథకం ద్వారా మొత్తం 3 విధాలుగా సబ్సిడీ ఇస్తారు.
- మొదటి విభాగంలో భాగంగా రూ. లక్ష లోన్ తీసుకుంటే.. దాని మీద 80 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే లబ్ధిదారులు రూ.20 వేలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
- రెండో విభాగంలో లబ్ధిదారులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లోన్ ఇస్తారు. దీనిపై 70 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
- మూడవ విభాగంలో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే 60 శాతం సబ్సిడీ వర్తింపజేస్తారు.
- ప్రధానంగా నిరుద్యోగ యువత, పేద కమ్యూనిటీల యువత లక్ష్యంగా ఈ రుణాలు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
