‘కియా’ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ 

ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం దుమారం రేపుతోంది. కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.

  • Publish Date - February 7, 2020 / 02:25 PM IST

ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం దుమారం రేపుతోంది. కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.

ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం దుమారం రేపుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ రాసిన కథనం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేసిన కుట్రగా సర్కార్ భావిస్తోంది. దీని వెనుక ఎవరున్నారనే అంశంపై దృష్టి పెట్టనుంది. అసత్య ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలనే యోచనలో ఉంది.

ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టిన వైసీపీ ప్రభుత్వం
కియా తరలింపుపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను వైసీపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. పరిశ్రమను తరలించడం లేదని, జరుగుతున్న ప్రచారం వట్టిదేనని వెల్లడించింది. ఏపీలో ఉన్న తన 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మార్చేందుకు కియా చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ సంచలన కథ రాసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం, కియా మోటార్స్ స్పందించాయి. 

కియా మోటార్స్ తరలింపుపై స్పందించిన కంపెనీ యాజమాన్యం
అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. పరిశ్రమను తరలించడానికి ఎలాంటి చర్చలు జరపలేదని, భారత్‌లో దీర్ఘకాలికంగా కియా కార్లను ఉత్పత్తి చేసేందుకే అనంతపురంలో పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేసింది కియా యాజమాన్యం. కార్ల ఉత్పత్తికి పూర్తిస్థాయిలో ప్లాంట్ ఏర్పాటు చేశామని వెల్లడించింది. 

కియా మోటార్స్ తయారీ కేంద్రాన్ని మార్చే ఆలోచన లేదు : మేనేజింగ్ డైరెక్టర్
అనంతపురంలో కియా మోటార్స్ తయారీ కేంద్రాన్ని మార్చే ఆలోచన లేదని కియా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. అనంతపురం తయారీ కేంద్రంలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో మేడిన్ అనంతపూర్ వాహనాలను భారత వినియోగదారులకు అందించేందుకు పని చేస్తున్నామని తెలిపారు. భారత్ మార్కెట్ లో దీర్ఘకాల సేవలు అందించేందుకు కియా సిద్ధంగా ఉందన్నారు.