తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలో కూడా భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. 2014-19 మధ్య మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ..వందల కోట్ల స్కామ్ ఈ ఆరు సంవత్సరాల్లో జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు.
డైరెక్టర్లు రమేష్, రవికుమార్, విజయ్ ఈ ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే వందల కోట్ల నకిలీ బిల్లులు బయటపడ్డాయి. నకిలీ కొటేషన్లతో లేని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వాస్తవ ధరకంటే 132 శాతం అధికంగా ఇచ్చినట్లు తేలింది. దీంతో గత ఆరేళ్లనుంచి జరగుతున్న ఈ దందాతో ప్రభుత్వానికి రూ.404 కోట్ల నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు.
నకిలీ సంస్థలకు 52 కోట్లు చెల్లింపులు చేశారు. ఈ ముగ్గురి డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ లు సహకరించినట్లుగా నిర్ధారణ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓమ్నీ మెడీ లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఎన్వెంటర్ పెర్మార్మెన్స్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంటు శాఖ విడుడల చేసింది.
ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయ్ ల హస్తం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు అక్రమంగా 85 కోట్ల రూపాయిలను డైరెక్టర్లు చెల్లించారు. ఆ ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని తేలింది.
Read More>>అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్