ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ : వేతనాలు పెంపు

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన

  • Publish Date - November 16, 2019 / 02:19 AM IST

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన కూడా కల్పిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టులో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్‌ లీడర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారి వేతనాలను పెంచింది. ఏకంగా డబుల్ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి శుక్రవారం(నవంబర్ 15,2019) ఉత్తర్వులు జారీ చేశారు.

వేతనాలు పెంచిన తర్వాత ఆరోగ్య మిత్రలు(పీహెచ్‌సీ ఆరోగ్యమిత్ర/నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్ర) రూ.12వేలు, టీమ్‌ లీడర్లు రూ..15వేలు జీతంగా అందుకోనున్నారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రల వేతనం రూ.6వేలు, టీమ్‌లీడర్ల వేతనం రూ.10వేల 600గా ఉంది. 

జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారని ప్రశంసించారు. చాలీచాలని జీతాల్లో చాలా అవస్థలు పడుతున్నామని.. ఈ తరుణంలో జీతాలు పెంచడం కొంత ఊరట కలిగించిందని చెప్పారు.