ఫిభ్రవరి 20న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఈసీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
అమరావతి : ఫిభ్రవరి 20న ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఈసీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పసుపు-కుంకుమ కింద ప్రభుత్వం ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఒక్క బూత్ లో మాత్రమే వీవీప్యాట్స్ స్లిప్ లను లెక్కిస్తామని పేర్కొన్నారు. క్యూలైన్ లు తగ్గించేందుకు టోకెన్ సిస్టం అమలు చేస్తామని చెప్పారు. 2019 ఎన్నికల నిర్వహణకు 3 లక్షల మంది ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు.