ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై సర్కార్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్
ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై సర్కార్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్ ఛాలెంజ్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం… అమరావతిలో న్యాయమూర్తులకు క్వార్టర్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై విచారణ వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో… నవంబర్ 3కు విచారణ వాయిదా వేసింది హైకోర్టు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాజధాని మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిప్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేపిటల్ గా అమరావతి సేఫ్ కాదని మంత్రులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో రాజధాని తరలింపు ఖాయం అనే డిస్కషన్ జరిగింది. దీనికి తోడు.. అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదు. పనులన్నీ ఆపేసింది జగన్ సర్కార్. దీంతో అనుమానాలు బలపడ్డాయి.
మరోవైపు టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని ప్రాంతంలోని ప్రాజెక్టులు, నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై నిజాలు తేల్చేందుకు జగన్ ప్రభుత్వం పీటర్ కమిటీని కూడా నియమించింది. దీనిపై అధ్యయనం చేసిన పీటర్ కమిటీ.. ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అవసరమైన దానికన్నా ఎక్కువ వ్యయం చేశారని పీటర్ కమిటీ తన నివేదికలో తెలిపింది.