శ్రీశైలం సాక్షి గణపతి అటవీ ప్రాంతంలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులిద్దరూ సూర్యపేట జిల్లా జమ్మిగడ్డ గ్రామం చిత్రం మాధవి, ఆమె కుమారుడు కార్తీక్ లుగా గుర్తించారు.
గత రెండేళ్లుగా తల్లి మాధవి కేన్సర్ తో బాధపడుతోంది. ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోవటంతో తనకొచ్చిన కేన్సర్ తగ్గేది కాదని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కుమారుడితో చెప్పాలని హైదరాబాద్ లో ఉన్న కార్తీక్ వద్దకు మే 5వ తేదీన వెళ్లింది. ఈ విషయాన్ని కొడుకుకు చెప్పింది. విషయం విన్న కార్తీక్ బోరున ఏడ్చాడు.
నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మ అంటు తల్లిని పట్టుకుని బోరున విలపించాడు కార్తీక్. ఇద్దరు శ్రీశైలంలోని సాక్షి గణపతి దేవాలయం సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం తాము శ్రీశైలం అడవుల్లో ఉన్నామని ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నామని బంధువులకు ఫోన్ చేసిన తెలిపి.. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి తల్లి కుమారులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకుంటున్నారనే విషయం తెలుసుకున్న బంధువులు సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు శ్రీశైలం పోలీసులకు సమాచారం అందించటంతో వారి కోసం అడవుల్లో గాలింపు చేపట్టారు. కానీ ఎంతకీ తెలియరాలేదు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే చెంచులకు ఓ ప్రాంతం నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండంతో వెళ్లి చూశారు. అక్కడ కుళ్లిపోయిన రెండు మృతదేహాలు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో తమకు అందిన తల్లి కుమారులే అనుమానంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలపై ఉన్న దుస్తుల ద్వారా నిర్ధారించుకుని బంధువులకు సమాచారం అందించగా వారు మాధవి, కార్తీక్ లను గుర్తించారు. ఈ ఘటన జరిగి ఆరు రోజుల క్రితం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.