మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం 

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.

  • Publish Date - December 6, 2019 / 12:18 PM IST

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. ఎన్ కౌంటర్ అయిన ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో పోస్టుమార్టం చేస్తున్నారు. ఆస్పత్రి దగ్గర భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రికే నలుగురు నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు మూడు బృందాలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ వైద్యులు, టీమ్ ఆఫ్ ప్యానల్ డాక్టర్లతోపాటుగా వీడియోస్ రికార్డు అనాలిసిస్ టీమ్ కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ అనాలిసిస్ ఆధారంగా పూర్తిస్థాయిలో నివేదికను రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అవే ఎవిడెన్స్ గా మారుతుంది కాబట్టి ఎక్కడెక్కడా గాయాలు అయ్యాయి, ఏ స్థలంలో బుల్లెట్స్ తగిలాయా. అలాగే వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి. వారి శరీరాలపై ఎలాంటి గాయాలు ఉన్నాయన్న విషయాలన్నింటినీ క్రోడీకరించి వీడియో రికార్డింగ్ అనాలిసిస్ ద్వారా నివేదిక అందజేసే అవకాశం ఉంటుంది.

షాద్ నగర్ ఎస్ హెచ్ వో స్టేషన్ ఆఫీసర్ కాపీలు, పంచనామా కాపీలు తీసుకొచ్చిన తర్వాత నేరుగా చటాన్ పల్లి నుంచి అర్ధగంట వ్యవధిలోనే నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే మృతదేహాలకు పోస్టుమార్టం ప్రారంభం అయింది. పంచనామా కాపీలతోపాటు ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా పోస్టుమార్టం కొనసాగుతోంది.

మొదటగా ఏ1 మహ్మద్ ఆరిఫ్ మృతదేహానికి పోస్టుమార్టం కంప్లీట్ అయిన తర్వాత జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నేరుగా స్పెషల్ ఎస్కార్ట్ , పోలీసుల బందోబస్తు నడుమ వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు జరుగనున్న స్మశాన వాటికకు డెడ్ బాడీలను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి అంత్యక్రియలు ఇవాళే చేయాలని నిందితుల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

దిశ హత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం(డిసెంబర్ 6, 2019) తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. (నవంబర్27, 2019) దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను గురువారం (డిసెంబర్5, 2019) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.