సద్వినియోగం చేసుకోండి : శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక

  • Publish Date - October 15, 2019 / 02:07 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక

తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. నెలలో రెండు రోజులు వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 15, 29 తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ 2 రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. 

ఐదేళ్లలోపు చంటి పిల్లల(ఐదేళ్లలోపు) తల్లిదండ్రులకు అక్టోబర్ 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 10 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే టోకెన్లను.. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు. అలాగే బుధవారం(అక్టోబర్ 16,2019) 5ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు.

సాధారణ రోజుల్లో ఏడాది లోపు పిల్లల తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.