కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

  • Publish Date - October 16, 2019 / 03:45 AM IST

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గొల్లపల్లి మండల చెందొలి గ్రామానికి చెందిన దండిగ శిరీష అనే యువతి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు వైద్యులకు కూడా చూపించారు. అయినా కడపునొప్పి మాత్రం తగ్గలేదు. 

ఈక్రమంలో మంగళవారం (అక్టోబర్ 15, 2019) మరోసారి శిరీషకు కడుపునొప్పి వచ్చింది. బాధ భరింలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో కుటుంబ సభ్యులు, బంధవులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.